అభిమాని అంత్యక్రియల్లో నాగబాబు
Monday, February 4th, 2008 at 12:00 am
చిరంజీవి రాజకీయాల్లోకి రావడం ఆలస్యమవడం తట్టుకోలేక ఆదివారం ఆత్మహత్య చేసుకున్న ఆయన అభిమాని పార్ధసారథి అంత్యక్రియలకు నాగబాబు హాజరయ్యారు. ఖమ్మం జిల్లా తూగూడెం గ్రామానికి చెందిన 35 యేళ్ల పార్ధసారథి భద్రాచలంలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. చిరంజీవిని ముఖ్యమంత్రిగా చూడాలన్న తన కోరిక ఇప్పట్లో తీరేట్లు లేదన్న బాధతో అతను ఆదివారం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవరం అతని భౌతిక కాయానికి జరిగిన అంత్యక్రియలకు చిరంజీవి సోదరుడు నాగబాబు హాజరై, సంతాపం తెలిపారు. అతని కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు.




























