చిరు అభిమానుల ఆందోళన
Friday, February 1st, 2008 at 12:37 am
చిరంజీవి పై రాజకీయ కుట్ర జరుగుతోందని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేస్తారన్న వార్త బయటకు వచ్చిన దగ్గరి నుంచి ఆయనను దెబ్బ తీసేందుకు కొన్ని రాజకీయ పక్షాలు కుట్ర పన్నుతున్నాయని చిరు అభిమానులు ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన చిరంజీవి అభిమానులు అమలాపురం లో గురువారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొన్న అభిమానులు రాజశేఖర్పై జరిగిన దాడిలో కొన్ని రాజకీయ పక్షాల హస్తం ఉందని, చిరంజీవి పేరు చెడగొట్టేందుకు వారు కావాలని ఇలాంటివి చేస్తున్నారని, చిరంజీవి అభిమానులు నిరసన మాత్రం వ్యక్తం చేసి వస్తే రాజశేఖర్ పై దాడి జరిగినట్టు కథ అల్లారని వారు ఆరోపిస్తున్నారు.




























