KK, Chiru talks
Sunday, March 2nd, 2008 at 10:34 pm

ఈరోజు వార్త దినపత్రిక ఎం.డి.గిరీష్ సంఘి తండ్రి రాం చరణ్ సంఘి మృతి సందర్భంగా చిరంజీవి బంజారాహిల్స్ లోని ఆయన ఇంటికి వెళ్ళారు. అక్కడేఉన్న పి.సి.సి.మాజీ చీఫ్ కె.కేశవరావును చిరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అక్కడేఉన్న బి.జె.పి.రాష్ట్ర అధ్యక్షులు బండారు దత్తాత్రేయతో కూడా మర్యాద పూర్వకంగా మాట్లాడారు. తరువాత కేశవరావు, మెగాస్టార్ చిరంజీవిలు ప్రత్యేకంగా కొంచెంసేపు మంతనాలు జరిపారు. వీరి భేటీ అక్కడున్నవారికి ఆశ్చర్యం కలిగించింది. తరువాత దీనిపై కె.కె. వివరణ ఇస్తూ చిరంజీవి నాకు స్నేహితుడని, మర్యాదపూర్వకంగా మట్లాడుకున్నామని, మీరనుకుంటున్నట్లుగా మామధ్య రాజకీయ చర్చలు ఏమీ జరగలేదని అన్నారు. రాం చరణ్ సంఘి భౌతిక కాయాన్ని సందర్శించిన వారిలో సి.ఎం.వై.ఎస్.రాజశేఖర్రెడ్డి, ఎం.ఎల్.ఎ.లు, ఎం.పి.లు ఉన్నారు.



























