Nagababu’s discussions with Uttarandhra Chiru fans
Wednesday, February 20th, 2008 at 12:00 am
చిరంజీవి తమ్ముడు నాగబాబు ప్రస్తుతం విశాఖపట్నంలో వున్నారు. ఇది రాసే సమయానికి ఆయన అక్కడి ఒక హోటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల చిరంజీవి అభిమాన సంఘ నాయకులతో చర్చిస్తున్నారు. రానున్న పార్టీకి సంబంధించి శ్రేణుల్ని ఎలా నిర్మించాలనే సంగతిని వారితో ఆయన చర్చిస్తున్నారు. వచ్చే ఉగాదిన చిరంజీవి పార్టీని ప్రకటించే సమయానికి జిల్లాల వారీగా పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేయడానికి నాగబాబు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఆయన రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలు పర్యటించి చిరంజీవి అభిమానులతో చర్చలు జరిపారు. జిల్లావారీగా తమ పార్టీకి ఉపయోగపడే నాయకుల లిస్టుని కూడా ఆయన తయారు చేస్తున్నట్లు వినిపిస్తోంది.



























